YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భార్యను చావబాదిన పోలీస్ కానిస్టేబుల్

భార్యను చావబాదిన పోలీస్ కానిస్టేబుల్

విజయవాడ, జూన్ 13, కృష్ణా జిల్లా  కంచికచర్ల మండలం కీసర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సునీల్ అనే పోలీస్ కానిస్టేబుల్ భార్య నవ్యపై తీవ్రంగా దాడిచేశాడు. కీసర గ్రామానికి చెందిన సునీల్ వత్సవాయి పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సునీల్ తల్లి ఇటీవల అధికార పార్టీ తరపు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొంతకాలంగా సునీల్, నవ్య మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సునీల్ తన భార్యను విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో బంధువులు ఆమెను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే నవ్య వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. తనను కొట్టమని అత్తే తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. సునీల్‌కు జగ్గయ్యపేటకు చెందిన మహిళతో అక్రమ సంబంధం ఉందని, అడ్డు తొలగించుకునేందుకు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ్య దగ్గర వాంగ్మూలం తీసుకున్న నందిగామ పోలీసులు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పో

Related Posts