YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

26న గవర్నర్ ఇళ్ల ఎదుట రైతుల ధర్నాలు 40 రైతు సంఘాల భాగస్వామ్యం సంయుక్త కిసాన్ మోర్చాపిలుపు

26న గవర్నర్ ఇళ్ల ఎదుట రైతుల ధర్నాలు   40 రైతు సంఘాల భాగస్వామ్యం సంయుక్త కిసాన్ మోర్చాపిలుపు

న్యూఢిల్లీ జూన్ 13,
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఈ నెల 26తో ఏడు నెలలు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున గవర్నర్ల ఇళ్ల ఎదుట ఆందోళన చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. 40 రైతు సంఘాల భాగస్వామ్యం కలిగిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) మాట్లాడుతూ.. ఈ నెల 26న నల్ల జెండాలు ఎగురవేసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మెమొరాండం పంపుతామని పేర్కొంది.ఎస్‌కేఎం నేత ఇందర్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. 26ను తాము ‘ఖేతీ బచావో, లోక్‌తంత్ర్ బచావో దివస్’ (వ్యవసాయాన్ని కాపాడు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడు)ను పాటిస్తామన్నారు. రాజ్‌భవన్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేస్తామని, ప్రతి రాష్ట్రంలోని గవర్నర్ల ద్వారా రాష్ట్రపతికి మెమొరాండం అందిస్తామని చెప్పారు.  

Related Posts