YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కియో, ఇన్నోవా మోటార్స్ కి డీలరు కేసీఆర్...

కియో, ఇన్నోవా మోటార్స్ కి  డీలరు కేసీఆర్...

జగిత్యాల, జూన్ 14,  ఆరోపణలున్న మంత్రులపై విచారణ చేయాలి కేటిఆర్ ఫాంహౌస్ పై కోర్టు స్టే ఎందుకు తెచ్చుకున్నారు...? 
ఉద్యోగులకు 2018 జూన్ నుంచి పిఆర్సీ అమలుచేయాలి తెలంగాణలో ఉద్యోగ నియామకాలు లేవు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కియో, ఇన్నోవా కంపెనీలకు డీలర్ గా మారాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు.
సోమవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి విలేకరులతో  మాట్లాడుతూ  కేసీఆర్ మంత్రివర్గంలో  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాం హౌస్ పై విచారణకు అదేశించాలని,నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని  జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు పెరుగుతున్న నిత్యావసర  వస్తువుల ధరలకనుగుణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ఇవ్వాల్సి ఉంటుందని 2018 జూన్ నుంచి  ఇవ్వాల్సి ఉండగా 2021 ఏప్రిల్ నుంచి ఇస్తాననడం, మిగతాది ఉద్యోగులు పదవి విరమణ పొందినప్పుడు చెల్లిష్టాననడం ఉద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పారు. దీనికి ఉద్యోగ సంఘాలు కేసీఆర్ కు పాలాభిషేకం చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ ఈవిషయం సీఎం, ఉద్యోగ సంఘలానేతలకే తెలియాలన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు స్వార్థంతో ఆలోచిస్తూ ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం దగ్గర తాకట్టుపెడుతున్నారని వారి తీరును దుయ్యబట్టారు. ఆత్మబాలిధానాలతో సాధించుకున్న తెలంగాణలో ఏడేళ్లుగా ఉద్యోగనియామకాలు లేవని రాష్ట్రంలో లక్ష 97వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని, ఇదేనా మనం కొట్లాడి సాధించుకున్నదని విమర్శించారు.ప్రయివేట్ విద్యాలయాలను ప్రోత్సహిస్తూ కెసిఆర్ విద్యను అంగట్లో అమ్మకానికి పెట్టాడని జీవన్ రెడ్డి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.2014 కు ముందున్న కేసీఆర్ ఆస్తులెన్ని ఇప్పుడున్న ఆస్తులెన్ని వీటిపై కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.  పిసిసి చీఫ్ పరిశీలనలో ఉంది. టిపిసిసి అధ్యక్ష పదవి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో ఉందని జీవన్ రెడ్డి అన్నారు. అధిష్టానం ఎవరికీచ్చిన కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఐక్యంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేస్తామని జీవన్ రెడ్డి అన్నారు.
"ఈటెల" బిజెపిలో చేరి ఉండేది కాదు...
మాజీ మంత్రి ఈటేలా రాజేందర్ బిజెపిలో చేరి ఉండేదికాదని, అలాగే కేసీఆర్ తో మాట్లాడి తెరాస లోనే ఉంటే బాగుండేదని  జీవన్ రెడ్డి రాజేందర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగడానికి బీజేపీ సహకరిస్తుందని చెప్పారు. స్వతంత్రంగా పోరాటం చేసిఉంటే తెలంగాణ వాదులు ఈటేల కు అండగా ఉండేవారని పేర్కొన్నారు. ప్రగతిశీల భావాలంటే ఇవేనా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో పిసిసిసి కార్య నిర్వాహక రాష్ట్ర  కార్యదర్శి బండ శంకర్ , మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లీ దుర్గయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి, , గాజుల రాజేందర్, గుంటి జగదీశ్వర్, జున్ను రాజేందర్, లైశెట్టి విజయ్,నేహాల్ తదితరులు పాల్గొన్నారు. 

Related Posts