ప్రాంతీయ పత్రికల సమస్యలు పరిష్కరించేందుకు టియుడబ్లుజే చిత్త శుద్ధి తో పని చేస్తుందని టియుడబ్లుజే ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ తెలిపారు.ప్రాంతీయ పత్రికల సమస్యల పై సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. చిన్న పత్రికల తో పాటు మాస పత్రి కల ఎడిటర్ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిదిగా పాల్గొన్న టియుడబ్లుజే ప్రధాన కార్యదర్శి క్రాంతి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంతీయ పత్రికల సమస్యలు పరిష్కరించేందుకు తాము చిత్త శుద్ధి తో పని చేస్తున్నామన్నారు. మే నెల 20 వ తేదీ న జరిగే తమ రాష్ట్ర మీటింగ్ లో ప్రాంతీయ పత్రికల సమస్యలను పరిష్కరించే అంశాల పై చర్చిస్తామని హామీ ఇచ్చారు. ప్రజపోరు దిన పత్రిక ఎడిటర్ యూసుఫ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో తెలంగాణా కేక ఎడిటర్ అక్తర్ హుస్సేన్, తెలంగాణా కేసరి దిన పత్రిక ఎడిటర్ కేసరి వెంకటేశ్వర్లు, తుఫాన్ దిన పత్రిక ఎడిటర్ బాలకృష్ణ, మహారధి ఎడిటర్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.