హైదరాబాద్ జూన్ 15
ఆర్థికలోటు పూడ్చుకోవడానికి భూములు అమ్మడం సరికాదని, భూముల అమ్మకం జీవోను ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో భూములు అమ్ముతుంటే తప్పుపట్టిన టీఆర్ఎస్ నేతలు, ఇప్పటి చర్యను ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. భూములు కాపాడుకోవడానికి సోనియా తెలంగాణ ఇచ్చారని, భూములు అమ్మొద్దని ఆనాటి సీఎంలకు కూడా చెప్పామని ఆయన అన్నారు.