YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం: ఏనుగు రవీందర్ రెడ్డి

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం: ఏనుగు రవీందర్ రెడ్డి

కామారెడ్డి జూన్ 15
తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని, సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన అనుచరులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఒక్కసారి ఎన్నికల్లో ఓడినందుకు తనకు తన కార్యకర్తలకు కేసీఆర్ సభ్యత్వం కూడా ఇవ్వలేదని రవీందర్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ 100 తప్పులను గ్రహించి ఈటెల వెంట బీజేపీ లోకి వెళ్ళామని చెప్పిన ఆయన రానున్న 2023 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని కేసీఆర్‌కు బుద్ధి చెప్తామని శపథం చేశారు.

Related Posts