YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నామాకు ఈడీ షాక్

నామాకు ఈడీ షాక్

హైదరాబాద్, జూన్ 16, 
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని నామాకు ఈడీ సమన్లు జారీ చేసింది. బ్యాంకు రుణాలను మల్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు నోటీసులు ఇచ్చింది. మదుకాన్ కేసులో నిందితులందరికీ సమన్లు జారీ చేసింది ఈడీ. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ... ఇటీవల రెండు రోజుల పాటు ఈడీ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది.స్వాధీనం చేసుకున్న డాక్యమెంట్లు, ఖాతాలు, హార్డ్ డిస్కులు ఈడీ అధికారులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు.  రాంచి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం తీసుకున్న రుణం మోసం కేసులో నాలుగు రోజుల క్రితం ఈడి ఆయన నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. కెనరా బ్యాంకు కన్సార్టియం రుణం ఎగవేత కేసులో రాంచి ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్, మధుకాన్ గ్రూపులపై సిబిఐ కేసు 2019 మార్చిలో నమోదు చేసింది.బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1,064 కోట్లలో సుమారు రూ.264 కోట్లు విదేశాలకు దారి మళ్లించారనే విచారణలో వెలుగు చూడ్డంతో విచారించాల్సిందిగా ఈడికి సిఫారసు చేశారు. రుణం ఎగవేత, నిధులు విదేశాలకు తరలింపుపై విచారణ జరపాల్సిందిగా హైకోర్టు సుమోటా తీసుకుని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఎంపి నామా నాగేశ్వర్ రావు తో పాటు ఇతర డైరెక్టర్లకు కూడా సమన్లు జారీ అయ్యాయి.

Related Posts