హైదరాబాద్, జూన్ 16,
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో టీపీసీసీ చీఫ్ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు... టీపీసీసీ పదవిపై ఆసక్తితో ఉన్నారు. పలువురు నేతలు రేసులో కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీపీసీసీ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ పోస్టుపై తనకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు.ఆ పదవి రేసులో కూడా తాను లేనని శ్రీధర్ బాబు ర్కొన్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా పాయింట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. శ్రీధర్ బాబు కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ రేసులో రేవంత్, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, జానా రెడ్డి పేర్లతో పాటు శ్రీధర్ బాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన రేసులో లేనని ప్రకటించడంతో .. తెలంగాణ కాంగ్రెస్కు కొత్త చీఫ్ ఎవరు? అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.