YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జూన్ 22న ఆర్ధిక శాఖతో సమావేశం

జూన్ 22న ఆర్ధిక శాఖతో సమావేశం

ముంబై, జూన్ 16, 
ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్‌లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు ఇన్ఫోసిస్‌ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర్లు, కన్సల్టెంట్లు, పన్ను చెల్లింపుదారులు సహా సంబంధిత విభాగాలకు చెందిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న అవాంతరాలు పన్ను చెల్లింపుదారులకు సమస్యగా మారాయి. ఆ ఇబ్బందులపై సంబంధిత వర్గాల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు, అభిప్రాయాలను కూడా ఇప్పటికే కోరారు. ఆ రాతపూర్వక స్పందనలకు ఇన్ఫోసిస్‌ బృందం తగిన పరిష్కారాలు చెప్పి సందేహాలు తీర్చనున్నది

Related Posts