పెద్దపల్లి
కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విప్లవాత్మకమైన నాలికతో రాష్ట్ర ప్రజలందరికీ వాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ లోని ఏవిఎన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను వైద్యులు రాజా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే రాబోవు ఉపద్రవాన్ని అరికట్టగలమని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.