కర్నూలు
నందిని కేతన్ అతిథి గృహంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పుష్ప గుచ్చం, పూల మొక్కలు అందజేసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డిఐజి వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపా సాగర్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె. పక్కిరప్ప, ఏపీ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ డి. నాగార్జున, జిల్లా జడ్జి ఫ్యామిలీ కోర్టు వి. శ్రీనివాస్, దేవస్థాన ఈవో కేఎస్.రామరావు, తదితరులు పాల్గోన్నారు. పోలీసుల నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గౌరవ వందనం స్వీకరించారు.