YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం.. ప్రజలను భయపెట్టొద్దు... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం.. ప్రజలను భయపెట్టొద్దు...  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ జూన్  18  
కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అనవసరంగా ప్రజలను భయపెట్టొద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో కోవిడ్ రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు భారత్‌లో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. భారత్‌ బయోటెక్‌కు వ్యాక్సిన్‌ అడ్వాన్స్‌ కింద రూ.1500 కోట్లు కేటాయించామని తెలిపారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను 15 రోజుల్లోనే అధిగమించామన్నారు. తెలంగాణలో 46 ఆస్పత్రులకు 1400 వెంటిలేటర్లు ఇచ్చామన్నారు. దీపావళికి 80 కోట్ల మందికి అదనంగా 5 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Related Posts