YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేపై కరపత్రాలు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేపై కరపత్రాలు

వరంగల్
సీఎం కేసీఆర్  రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలంరేపాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలోఈ కరపత్రాలు హాట్ టాపిక్ గా మారాయి. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘాటుగా లేఖలో గుర్తుతెలియని వ్యక్తులు పేర్కోన్నారు. న్యూస్ పేపర్ లో పెట్టి వరంగల్ తూర్పులో పంపిణీ చేసారు. సోమవారం  సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు విడుదల అయ్యయి. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బీఫామ్ 50 లక్షలకు అమ్ముకున్నడని, గతంలో ములుగు జిల్లాలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు వసూలు చేసాడని లేఖలో గుర్తు తెలియని వ్యక్తులు పేర్కోన్నారు. వరంగల్ తూర్పులో భూ కబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్లు అంటూ ఘాటుగా  ఆరోపణలు చేసారు.

Related Posts