హైదరాబాద్ జూన్ 21
;బి.సిల సమస్యల పై ముఖ్యమంత్రి కెసిఆర్ అద్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి పరిష్కరిస్తామని బి.సి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పెరిగిన ధరల ప్రకారం హాస్టల్ విద్యార్ధుల మెస్ చార్జీలు/ కాలేజి విద్యార్థుల స్కాలర్ షిప్ లు పెంచాలని బి.సి సంఘాల నాయకులు మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.అలాగే బి.సి కార్పోరేషన్ లో పెండింగులో ఉన్న సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రితో బి.సిల సమస్యలు పరిష్కరించడానికి అత్యదిక ప్రాదాన్యత ఇస్తున్నరన్నారని మంత్రి తెలిపారు.