హైదరాబాద్
మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదు. కోర్ కమిటీ సమావేశం లేదు.. ఎలాంటి చర్చ లేదు. కర్ణాటక లో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీ ని పంపించారు. ఇక్కడ మాణిక్కం ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా అని కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. ఈ రోజు తెలంగాణ లో ఉత్తమ్ , భట్టి వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వుందని అయన విమర్శించారు. నేను కాంగ్రెస్ మనిషి ని.. నేను ఫోన్లు చేస్తే కూడా లిప్ట్ చేయడు. ఫోన్లు కొందరికే చేసి నిర్ణయిస్తారా.. ఇంత సీనియర్ అయినా నాకు ఫోన్ రాలేదు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్న.. సమీక్ష చేసే నాయకుడే లేరు. పీసీసీ అధ్యక్షుడి విషయంలో పరిశీలకుడు వచ్చి వెళ్లాకే ప్రకటన చేయాలి. ఢిల్లీ నుంచి పీసీసీ నిర్ణయిస్తే.. పార్టీ లో ఎవరు ఉంటరో లేదో తెలియని పరిస్థితి. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏం కావాలని అయన అన్నారు.