హైదరాబాద్ జూన్ 21
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలను మరింత బాగు చేసుకునేందుకు జులై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పది రోజుల పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం చేపడుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నెల 26వ తేదీన మినిస్టర్లు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ రోజు మొత్తం ఎజెండా ఫైనల్ చేద్దామన్నారు.ప్రతి గ్రామానికి నర్సరీ ఉంది. ట్రాక్టర్లు వచ్చాయి. మున్సిపాలిటీల్లో అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదు. రాజకీయాల్లో నేల విడిచి సాము చేయడం జరుగుతుంది. గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెలిగిపోవాలి. ఇవి సాధిస్తే.. దానికి మించిన పని లేదు. ప్రతీ గ్రామం అభివృద్ధి చెందుతోంది. ప్రజలకు అవసరమైన సదుపాయాలన్నింటినీ కల్పిస్తున్నాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.