YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మహిళ దారుణ హత్య

 మహిళ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగరం పెద్దతాండాలో ధారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున భర్త కసాయిల మారి భార్యను హత్యచేసాడు. మహరాష్ట్రా కు చెందిన ఐశ్వర్య తన కుటుంబీకులతో కలిసి కోన్నిరోజులక్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. అయితే శంషాబాద్ మండలం గోల్లపల్లిలో  లో ఉంటు శంషాబాద్ లోని ఓ బట్టలషాప్ లో పనిచేస్తు ఉండేది. దీంతో అమేకు విఠల్ నాయక్ పరిచమయ్యాడు. అ పరిచయం కాస్త ప్రేమగా మారి ఏడాది క్రితం పెద్దల ను ఓప్పించి శంషాబాద్ లోని సిద్దుల గుట్ట సిద్దేశ్వర అలయంలో వివాహం చేసుకున్నారు. రెండు మూడు నెలలు బాగా సాగిన వీరి సంసారంలో వరకట్నం వేదింపులు మెుదలైయ్యి. వరకట్నం ఇవ్వలేని స్థితిలో ఉంది ఐశర్యకుటుంబం. దీంతో ఐశ్వర్యను వదిలించుకోవాలని పథకం వేసిన భర్త విఠల్ నాయక్ గత రాత్రి అమెను దారుణంగా హత్యచేసి వ్యవసాయ పోలాలలో వేశాడు. ఇదిగమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం పోలీసులు మృతదేహాని పోష్టుమార్టం కోరకు ఉస్మానియా అస్పత్రికి తరలించారు. నిందితుడు  విఠల్ నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Posts