వేములవాడ పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ ఫైనాన్స్ వ్యవహారాలపై దాడులు నిర్వహించారు. మంగళవారం నాడు జిల్లా ఎప్సీ ఆదేశాలనుసారం ఫైనాన్స్చ చిట్టి వ్యాపారం నడుపుతున్న వ్యక్తుల ఇళ్ళపై దాడులు జరిపి సోదాలు చేసారు. రాచకొండ ప్రసాద్, పైడి శ్రీనివాస్, తూప్ కారి అంజయ్య, రాపెళ్లి మహాదేవ్, దువ్వ శ్రీనివాస్, నాయిని వేణు లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులనుంచి 18 ఖాళీ చెక్ లు, 08 చెక్ జిరాక్స్ లు, 2 నోట్ బుకులు, 16 బాండ్ పేపర్లు, 25 చిట్టి వసూలు బుక్ లు, 34 ప్రామిసరి నోట్ లు, నగదు రూ 20000 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వేములవాడ, సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అక్రమ వడ్డీ వ్యాపారంపై దాడులు యధాతథంగా కొనసాగుతూనే ఉంటాయి. అక్రమ వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్ వ్యాపారులు తమ పద్దతి మార్చుకోకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.