YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాలు డిశ్చార్జీ లో ఎన్నో ట్విస్టులు

లాలు డిశ్చార్జీ లో ఎన్నో ట్విస్టులు

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిశ్చార్జ్‌పై పెద్ద రగడే జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి రాంచీ చేరుకునే వరకు సినిమా ట్విస్టుల్ని తలపించింది. చివరికి రిమ్స్‌కు చేరాక డాక్టర్లు వైద్య పరీక్షల నిర్వహించడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టారు. అసలు విషయానికొస్తే... దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న లాలూ తీవ్ర అస్వస్థతతో రాంచీలోని రిమ్స్‌లో చేరారు. అక్కడ వైద్యం అందించిన డాక్టర్లు... మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు రిఫర్ చేయడంతో అక్కడికి తరలించారు. అయితే లాలూ ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో... ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు నిన్న డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టిన లాలూ... డిశ్చార్జ్ కావడానికి నిరాకరించారు. రాంచీకి తిరిగి వెళ్లేందుకు ఓపిక కూడా తనకు లేదన్నారు. దీనిపై కుటుంబ సభ్యులతో పాటూ ఆర్జేడీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కుట్రతోనే ఇలా చేస్తున్నారని కూడా ఆరోపించారు. అయినా డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేయగా... అధికారులు ట్రైన్‌లో రాంచీకి తరలించారు. అయితే మధ్యలో లాలూ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు... కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో... డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. లాలూకు రక్తపోటు, షుగర్ పెరగటంతో... అక్కడే చికిత్సను అందించారు. తర్వాత అక్కడి నుంచి బయల్దేరి రాంచీకి చేరుకున్నారు.రాంచీ వెళ్లాక ఆయన్ను రిమ్స్‌కు తరలించారు. వెంటనే ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి... ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ప్రకటించారు. అయితే వయసు వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని... అంతకుమించి ఇబ్బందులు లేవని చెప్పడంతో ఈ వివాదం సద్ధుమణిగింది. అయితే లాలూ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts