YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జమ్మూ కశ్మీర్‌కు మొదట సంపూర్ణ రాష్ట్ర హోదాను ప్రకటించాలి... కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్

జమ్మూ కశ్మీర్‌కు మొదట సంపూర్ణ రాష్ట్ర హోదాను ప్రకటించాలి...  కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్

న్యూఢిల్లీ జూన్ 25
జమ్మూ కశ్మీర్‌కు మొదట సంపూర్ణ రాష్ట్ర హోదాను ప్రకటించాల్సిందేనని, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం డిమాండ్ చేశారు. అలా కాకుండా మొదట ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించడం వింతగా ఉందని విమర్శించారు. ‘‘మొదట రాష్ట్ర హోదా ఇచ్చి, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్‌తో సహా కశ్మీరీ నేతలందరిదీ ఇదే మాట. ‘‘ఓ బండిని గుర్రం లాగడం సహజమైన ప్రక్రియ. అందుకే గుర్రాన్ని ముందు పెట్టి, బండిని లాగాలి. జమ్మూ కశ్మీర్ విషయంలోనూ అంతే. మొదట రాష్ట్రహోదా. ఆ తర్వాతే ఎన్నికలు. అలా నిర్వహిస్తేనే ఎన్నికలు సరైన క్రమంలో జరుగుతాయి. కానీ ఇందుకు విరుద్ధంగా కేంద్రం ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు’’ అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.  

Related Posts