YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రామాల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌ధాని మోదీ స‌మీక్ష

రామాల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌ధాని మోదీ స‌మీక్ష

న్యూఢిల్లీ జూన్ 26
 అయోధ్య‌లో చేప‌డుతున్న రామాల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌ధాని మోదీ స‌మీక్షించారు. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌తో మోదీ వ‌ర్చువ‌ల్ వీడియో స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ ఇద్ద‌రూ ఇటీవ‌ల భేటీలో పాల్గొన‌డం ఈనెల‌లో రెండ‌వ‌సారి. అయోధ్య అభివృద్ధి కోసం చేప‌డుతున్న అభివృద్ధి ప‌నుల ప్ర‌ణాళిక‌ల‌ను యోగి వివ‌రించారు. రోడ్ల నిర్మాణం, మౌళిక స‌దుపాయాలు, రైల్వే స్టేష‌న్‌, విమానాశ్ర‌య నిర్మాణాల కోసం వేసిన ప్ర‌ణాళిక‌ల‌ను సీఎం యోగి తెలియ‌జెప్పారు. అయోధ్య‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మించాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఆమోదం తెలిపిన‌ట్లు సీఎం యోగి గ‌తంలోనే తెలిపారు. ప్ర‌ధాని మోదీ, యూపీ సీఎం యోగి .. అయోధ్య గురించి చ‌ర్చించ‌డం మంచి ప‌రిణామం అని, వారు చ‌ర్చిస్తేనే అయోధ్య‌లో ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంద‌ని అయోధ్య ఆల‌య పూజారి స‌త్యేంద్ర దాస్ తెలిపారు.

Related Posts