YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ పాలనలో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది

జగన్ పాలనలో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది

అమరావతి జూన్ 26
జగన్ రెడ్డి పాలనలో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ నేత మునెప్ప ఆస్తులు ఆక్రమించి.. తిరిగి దాడి చేస్తారా అని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో అరాచకానికి, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ అని అన్నారు. రోజుకో హత్య, గంటకో విధ్వంసం రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయాయని తెలిపారు. చిత్తూరు జిల్లా రామసముద్రంలో టీడీపీ నేత మునెప్పపై వైసీపీ దాడి హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి కబ్జా చేసి.. అడ్డుకున్నందుకు హతమార్చాలని ప్రయత్నిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని నిలదీశారు. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతూనే ఉందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చింది పేదల ఆస్తుల్ని ఆక్రమించడానికా అని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోతున్నా తాడేపల్లి బాలింత బయటకు రాకపోవడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Related Posts