YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇది చలనం లేని ప్రభుత్వం: ప్రత్తిపాటి పుల్లారావు

ఇది చలనం లేని ప్రభుత్వం: ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు జూన్ 29
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది చలనం లేని ప్రభుత్వమన్నారు. సీఎం నివాసం నుండి బయటకు రారు... సమస్యలను పరిష్కరించరని మండిపడ్డారు. ప్రతిపక్షాల సూచనలు, సలహాలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. తెల్లరేషన్ కార్డు దారులకు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పదిలక్షలు ఇవ్వాలని, ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అన్నారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించారని తెలిపారు. జగనన్న కాలనీలోని ఇళ్ళు అగ్గిపెట్టెల్లా ఉన్నాయని వారి పార్టీ శాసనసభ్యులే అంటున్నారని చెప్పుకొచ్చారు. జగనన్న కాలనీల కోసం కొనుగోలు చేసిన భూములపై సీబీఐ విచారణ జరిపిస్తే ఈ ప్రభుత్వం బండారం బయటపడుతోందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

Related Posts