హైదరాబాద్
మంత్రి కేటీఆర్ షో చేయడం తప్ప చేసేందేమి లేదని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు అయన జీహెచ్ఎంసీ కార్యాయలం దగ్గర మీడియాతో మాట్లాడారు. వర్షం వస్తే..నాలాలు పొంగి పోర్లు తున్నాయి.. కాలనీలు చెరువు లుగా మారుతున్నాయి. మాటలు కాదు చేతల్లో తన పని చూపించాలి. హైదరాబాద్ విశ్వనగరాన్ని చెత్త నగరం గా మార్చిన ఘనత కేటీఆర్ దే. జీహెచ్ఎంసీ లోకి జర్నలిస్టుల ఏందుకు వెళ్ళనివ్వడం లేదు. కాంగ్రెస్ కార్పోరేటర్ లు జీహెచ్ఎంసీ లో బలంగా పోరాడుతారనే నమ్మకం నాకు ఉందని అన్నారు.