YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చార్‌ధామ్ యాత్రను వాయిదా ఉత్త‌రాఖండ్ స‌ర్కారు

చార్‌ధామ్ యాత్రను వాయిదా ఉత్త‌రాఖండ్ స‌ర్కారు

డెహ్రాడూన్‌ జూన్ 29
ప్రతిష్ఠాత్మక చార్‌ధామ్ యాత్రను వాయిదా వేస్తున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ స‌ర్కారు ప్ర‌కటించింది. త‌దుప‌రి ఆదేశాలు జారీచేసే యాత్ర వాయిదా కొన‌సాగుతుంద‌ని పేర్కొన్న‌ది. ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఆదేశాల మేర‌కు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. యాత్ర వాయిదా నేప‌థ్యంలో కొవిడ్ సంబంధ మార్గ‌ద‌ర్శ‌కాల్లో ప్ర‌భుత్వం మ‌రోసారి మార్పులు చేసింది.అంత‌కుముందు ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్‌ధామ్ యాత్రను పాక్షికంగా ప్రారంభించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. జూలై 1 నుంచి యాత్ర మొద‌టి ద‌శ‌ను, జూలై 11 నుంచి యాత్ర రెండో ద‌శ‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉత్త‌రాఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ‌లైంది.ఆ వ్యాజ్యంపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వ‌ నిర్ణయంపై స్టే విధించింది. కొవిడ్ సూపర్ స్పైడర్‌గా మారకుండా యాత్రను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. మనోభావాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ స‌ర్కారు యాత్ర‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించింది.

Related Posts