YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రధాని మోదీకి మామిడి పండ్లను బహుమతిగా పంపిన మమతా బెనర్జీ,

ప్రధాని మోదీకి మామిడి పండ్లను బహుమతిగా పంపిన మమతా బెనర్జీ,

కోల్‌కతా జూలై 1
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2011లో తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం హిమసాగర్‌, మాల్డా, లక్ష్మణ్‌భోగ్‌ వంటి ప్రత్యేక రకాల మామిడి పండ్లను మోదీకి పంపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ప్రధాని మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ మధ్య వైరం, మాటల యుద్ధం కొనసాగుతున్నది. అయినప్పటికీ సహృదయ భావంతో మోదీకి మమత మాడిమి పండ్లు పంపారు. ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితర నేతలకు మామిడి పండ్లను బహుమతిగా పంపారు. ఇది బెంగాలీ సంస్కృతి అని గతంలో మోదీకి మమత కౌంటర్‌ ఇచ్చారు.

Related Posts