మార్చి 24న రాష్ట్ర ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో అనూప్సింగ్ తెలిపారు. 2018 ఓటర్ల జాబితా విడుదలపై మంగళవారం షెడ్యూల్ను ప్రకటించారు. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా అనుమతి రాలేదన్నారు. రాష్ట్రంలోని 83 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేశారు. తేదీ 1.1.2018 వరకు 18 ఏండ్లు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 23న డ్రాఫ్ట్ రోల్ ప్రకటన, ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 14 వరకు అభ్యంతరాలు, సవరణలు, ఫిబ్రవరి 4 నుంచి 11వరకు ప్రత్యేక అవగాహన శిబిరాలు, మార్చి 5న అభ్యంతరాల అనంతరం జాబితా, మార్చి 15న ఓటర్ల డాటా అప్డేట్, మార్చి 22న తుదిజాబితా ప్రింటింగ్, మార్చి 24న ఓటర్ల తుదిజాబితా ప్రకటిస్తారు.