YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అంత‌రించిపోతున్న వన్య‌ప్రాణుల ప‌రిర‌క్ష‌ణ‌కు అధ్య‌య‌నం అవసరం... ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు

అంత‌రించిపోతున్న వన్య‌ప్రాణుల ప‌రిర‌క్ష‌ణ‌కు  అధ్య‌య‌నం అవసరం...  ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు

హైద‌రాబాద్ జూలై 2
అంత‌రించిపోతున్న జాతుల ప‌రిర‌క్ష‌ణ‌కు వన్య‌ప్రాణుల అధ్య‌య‌నం ఎంతో ప్రాముఖ్య‌త‌ను వ‌హిస్తుంద‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. అదేవిధంగా జూనోటిక్ వ్యాధుల‌ను అర్థం చేసుకునేందుకు, అంచ‌నా వేసేందుకు ఇది ఉప‌క‌రిస్తుంద‌న్నారు. హైద‌రాబాద్ అత్తాపూర్‌లోని సీసీఎంబీ లాకోన్స్ జంతు ప‌రిశోధ‌న‌శాల‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మినీ జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌ను వీక్షించారు. రాతి క‌ట్ట‌డాల‌ను ప‌రిర‌క్షించేలా నిర్మించిన భ‌వ‌న స‌ముదాయంను ప‌రిశీలించారు. శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌క విద్యార్థుల‌తో ఉప‌రాష్ట్ర‌ప‌తి స‌మావేశమ‌య్యారు.

Related Posts