హైదరాబాద్, జూలై 3,
రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ లో వేగంగా సమీకరణాలు మారుచతున్నాయి. ఖమ్మం జిల్లా నేత భట్టి విక్రమార్క లేకుండానే , ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు .అయితే ఈ సమావేశాన్ని రేణుకా చౌదరి ఏర్పాటు చేయడం వెనక రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ ఉందంటుంన్నారు. పీసీసీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలందరినీ మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు . అయితే ఈరోజు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి... ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి , స్తంబాని చంద్రశేఖర్ ,మానవతారాయ్ తో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులంతా హాజరయ్యారు ..అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఈ జిల్లా వాసే అయినప్పటికీ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం తో పార్టీ లో ఏదో జరుగుతుందనే అనుమానం కలుగుతుంది ఆ జిల్లా నేతలకు.ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మొదటి నుంచి భట్టి విక్రమార్క కు రేణుకా చౌదరి కి పడదు అనేది ఆ జిల్లా పార్టీ నేతల మాట ..అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రేణుకా చౌదరి రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక యాక్టీవ్ అయ్యారు.. అయితే జిల్లా లో భట్టి కి చెక్ పెట్టాలని చూస్తున్న రేణుకా చౌదరి కి రేవంత్ రెడ్డి పీసీసీ కావడం తో వెంటనే రంగంలో కి దిగినట్లు . పార్టీ ముఖ్యనేతలందరినీ పిలిచి భట్టి కి చెక్ పెట్టాలని సూచించినట్లు సమాచారం.. రేవంత్ రెడ్డి కూడా రేణుకా చౌదరి కి మద్దతు తెలిపినట్లుగా పార్టీ లో చర్చ జరుగుతుంది..జిల్లా లో భట్టి వ్యతిరేక వర్గాన్నంతా ఎకం చేసి భట్టి పై ఓత్తిడి తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్ గా రేణుకా చౌదరి అనుచరులు చెప్తున్నారు..భట్టి కి చెక్ పెట్టడం ద్వారా ఖమ్మం జిల్లా పార్టీ మొత్తం తన గుప్పిట్లో కి వస్తుందనేది రేణుకా చౌదరి ప్లాన్ గఆ తెలుస్తోంది...అటు రేవంత్ రెడ్డి కి కూడా జిల్లా మొత్తాన్ని అజమాయిషీ చేసే నేత తనకు మద్దతు ఇవ్వడం వల్ల తన పలుకుబడి పెరుగుతుందని ఆయన కూడా రేణుకా చౌదరి కి అవుట్ రైట్ గా మద్దతు ఇస్తున్నాట్లు సమాచారం..మొత్తానికి ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క ను పక్కకు పెట్టాలనే రేణుకా చౌదరి ప్లాన్ ఎంతమేరకు సక్సెస్స్ అవుతుందో చూడాలి మరి...