శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవాం కస్టమ్స్ అధికారులు విసృత తనిఖీలు నిర్వహించారు. అధికారులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు జరిపిన తనిఖీల్లో 799 గ్రాముల బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు 799 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని విమానంలోని సీటు పక్కనే దాచి వుంచినట్లు అధికారులు పసిగట్టారు. పసిడి విలువ రూ 25 లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు.