రాజన్న సిరిసిల్ల
వేములవాడ పట్టణంలోని 10 వార్డు పట్టణ ప్రగతి ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు బాగుండాలని ఉద్దేశం తోనే ముఖ్యమంత్రి పల్లె, పట్టణ ప్రగతి ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరుతో నల్లాలు ఇస్తాము. దసరా వరకు వేములవాడ పట్టణంలో ప్రతి ఇంటికి నల్ల వస్తది. ఒక్క రూపాయికే నల్ల కలెక్షన్ ఇస్తారు. పట్టణంలో వైకుంఠ ధామం ఏర్పాటుకు ఏర్పాటు పూర్తి అవుతుంది. ఏసీ కాలనిలో కమిటీ హాలు నిర్మాణకు భూమి పూజ చేయాలని మునిసిపల్ పాలకులను ఆదేశించారు. 25 లక్షల తో నిర్మించాలని, వెంటనే ముహూర్తం కు పూజ చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో కార్పొరేటుకు ధీటుగా 100 పడుకల అసుపత్రిని ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా పరిష్కారం చేయడమే మా ధ్యేయం. ప్రతి మున్సిపాలిటీ కి డంపుయార్డును ఏర్పాటు చేస్తున్నాం. ఇంటింటి ముందు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. వాటి వల్ల ప్రాణవాయువు వస్తుందని అన్నారు.