YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి రాజధాని లో జరిగేది ఫోటో ఉద్యమం మాత్రమే

అమరావతి రాజధాని లో జరిగేది ఫోటో ఉద్యమం మాత్రమే

అమరావతి జూలై 4,  అమరావతి రాజధాని లో జరిగేది ఫోటో ఉద్యమం మాత్రమే  వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు.
అమరావతి రాజధాని ఉద్యమంపై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో జరిగేది ఫోటో ఉద్యమం మాత్రమే అని అన్నారు. మందడం నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తోనే రాజధాని అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రైతులెవరూ తమ సమస్యలపై తనను కలవలేదని తెలిపారు. రైతులు వచ్చి కలిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. రోడ్డుపై వినతి పత్రాలు ఇస్తే ఎలా అని... వారి సమస్యలపై తనను కలిసి చెప్పొచ్చు అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అంతకు ముందు సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవిని  లింగాయపాలెం వద్ద దళిత మహిళా రైతులు, రాజధాని రైతులు అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దళిత రైతు పులిచిన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎమ్మెల్యే వెళ్లాక వదిలిపెట్టేశారు. కాగా అసైన్డ్ కౌలు, అమరావతి పింఛను కోసం వినతి పత్రం ఇద్దామనుకుంటే అరెస్ట్‌లు చేస్తారా?...తమ గోడు వినరా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts