YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టుతున్న జగన్, కేసీఆర్‌లు

ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టుతున్న జగన్, కేసీఆర్‌లు

హైదరాబాద్ జూలై 4,
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌లు ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరూ రావుగోపాల్ రావు.. అమ్రిష్ పురి నటనను మించి నటిస్తున్నారన్నారు. జల జగడం .. ఓ పెద్ద డ్రామా అని చెప్పారు. కేసీఆర్ జగన్‌ల రాజకీయ నాటకాలకు ప్రజలు బలికావొద్దని చెప్పారు. ప్రజలు ఎక్కడికక్కడ గల్లా పట్టి అడగాలన్నారు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కృష్ణ బేసిన్‌లో ఉండే ప్రాజెక్ట్స్ పూర్తి చేసేవారన్నారు. అలా చేస్తే జగన్ జల దోపిడీ చేసినా తెలంగాణకు  ఏమీ ఇబ్బంది ఉండేది కాదని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

Related Posts