YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు: నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి

యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు: నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి

చిత్తూరు జూలై 4,
చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి అన్నారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గ్రామాల్లో హైవేకు ఆనుకుని రూ.400 కోట్ల భూకుంభకోణం జరుగుతుందన్నారు. మంత్రి, ఎంపీల అండ చూసుకుని వైసీపీ నేతల భూకబ్జా చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ భూములకు లే అవుట్లు వేసి అక్రమంగా అమ్మేస్తున్నారన్నారు.  ఊర్లు, సర్వే నెంబర్ల వివరాలతో కూడాన పొటోలను కిశోర్ కుమార్ రెడ్డి మీడియా ముందు బయటపెట్టారు. చిత్తూరు జిల్లాలో భూఅక్రమాలపై సర్వే నెంబర్లతో సహా బయటపెడతామన్నారు.భూకుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన భూములు చెల్లవని కోర్టు తీర్పు వస్తే ప్రజలు నష్టపోతారన్నారు.మదనపల్లె, ఇతర ప్రాంతాలకు కూడా భూకుంభకోణం విస్తరించిందన్నారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదన్నారు.అక్రమాలకు సహకరించిన అధికారులకూ భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని కిశోర్ కుమార్ రెడ్డి తెలిపారు. 

Related Posts