YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురామ కృష్ణంరాజు లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ

రఘురామ కృష్ణంరాజు లేఖపై స్పందించిన  కేంద్ర హోంశాఖ

అమరావతి జూలై 4,
వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సునీల్‌ హిందూ  మత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ విషయంపై ఏపీ చీఫ్ సెక్రటరీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. రఘురామ లేఖ, సునీల్‌ ప్రసంగ వీడియోల ఆధారంగా.. తగిన చర్యలు  తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను  కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సునీల్ కుమార్ తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. కాగా గతంలో సునీల్‌పై కేంద్ర హోంశాఖకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ కన్వీనర్ వినయ్ జోషి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Related Posts