యాదాద్రి భువనగిరి జూలై 7
రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడించారు. గ్రామస్తుల జీవన స్థితిగతులపై కులాల వారీగా గణాంకాలను సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా పక్కాగా చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.