YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హెచ్చార్సీని ఆశ్రయించిన నర్సులు

హెచ్చార్సీని ఆశ్రయించిన నర్సులు

హైదరాబాద్
కోవిడ్ సమయంలో సేవల అందించిన నర్సులు గురువారం నాంపల్లి లోని తెలంగాణా  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.  కష్ట సమయంలో సేవలు చేయించుకొని అవసరం తీరిన తర్వాత ప్రభుత్వం రోడ్డుమీద పడెయ్యడం చాలా భాదాకరం అని నర్సుల ఆవేదన వ్యక్తం చేసారు.  తొలగించిన 1640 మంది నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసారు.  ఈ మేరకు తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేసారు. కోవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకం అయిన నర్సులకు మంగళవారం రాత్రి టెర్మినేట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే.  దాంతో వారంతా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.

Related Posts