సూర్యాపేట
రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడు. అధికారంలోకి వస్తాం అని పగటి కలలు కంటున్నడు. ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించరు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు ఉంది ప్రతిపక్షాల పరిస్థితి. యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని వేళలా అండగా ఉంటుందని అన్నారు.
ప్రతిపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదు. పక్కా రాష్ట్రం ఆంధ్రకు లాభం చేసేలా వ్యవహరించాయి ప్రతిపక్షాలు... వాటిని ప్రజలు గమనించారు. ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరు. సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ దొంగ అన్నట్లు గా ఉంది. జలదోపిడి చేస్తూ నీతులు మాట్లాడుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారని అన్నారు.
జగన్ ప్రభుత్వం 203 జి ఓ ను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారు..ఇక ఆటలు సాగవు. జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండదు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కు ఎలాంటి నష్టం కానివ్వరని మంత్రి అన్నారు.