YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సెరికల్చర్ రిటైర్డ్ సిబ్బంది వేడుకోలు

సెరికల్చర్ రిటైర్డ్ సిబ్బంది వేడుకోలు

సెరికల్చర్ రిటైర్డ్ సిబ్బంది వేడుకోలు
అనంతపురం
అనంతపురం జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ ను పట్టు పరిశ్రమ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీధర్ సందర్శించారు. సిరికల్చర్ డిపార్ట్ మెంట్ లో పదవి విరమణ పొందిన వారికి గత నాలుగేళ్లుగా పెన్షన్ రాకపోవడంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది అంటూ కమిషనర్ ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని మమ్మల్ని ఆదుకొని పెన్షన్ వచ్చే విధంగా సహరించాలి అని కమిషనర్ ను  కోరారు.  58 మంది రిటైర్డ్ ఉద్యోగులకు 2017 నుంచి పెన్షన్ అందక కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారిందని అన్నారు. తమతోపాటు పదవి విరమణ పొందిన కొంతమందైతే దేవాలయాల దగ్గర బస్టాండ్ దగ్గర బిక్షాటన చేసుకొని కుటుంబపోషణ చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అయితే కమిషనర్ వారి సమస్యలు పట్టు పట్టనట్లుగా వెళ్లిపోవడం పై వారు తీవ్రంగా దిగులు చెంది తమకు న్యాయం చేయాలని  కోరారు.

Related Posts