YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రౌతలపూడిలో టీడీపీ బృందం..అడ్డుకున్న పోలీసులు

రౌతలపూడిలో టీడీపీ బృందం..అడ్డుకున్న పోలీసులు

రౌతలపూడిలో టీడీపీ బృందం..అడ్డుకున్న పోలీసులు
రాజమండ్రి
తూర్పుగోదావరి జిల్లా  నేడు   ప్రత్తిపాడు  నియోజకవర్గం   రౌతులఫూడిలో  అక్రమ బాక్సైట్  తవ్వకాలు జరుగుతున్నాయనే  అభియోగంపై  పరిశీలించడానికి  టిడిపి ప్రతినిధి బృందం బయలుదేరింది. విశాఖ జిల్లాలో బాక్సైట్   తవ్వకాలను  గిరిజనులు వ్యతిరేకిస్తున్నారనే  ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లా వైపు నుండి తవ్వకాలు జరుపుతున్నారని  బృందం ఆరోపించింది. టిడిపి నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో  వెళ్ళుతున్న టిడిపి ప్రతినిధి బృందాన్ని రౌతులపూడి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. కరోనా సమయంలో కరోణ నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఇటువంటి పరిశీలనలు తగవని పోలీసులు అన్నారు

Related Posts