YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

స్పీకర్ పై ....విజయసాయి  హాట్ కామెంట్స్

స్పీకర్ పై ....విజయసాయి  హాట్ కామెంట్స్

స్పీకర్ పై ....విజయసాయి  హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ, జూలై 9
తెలంగాణ, ఏపీ మధ్య నెలకున్న కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరామని తెలిపారు. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
కేఆర్‌ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు సీఐఎస్ బలగాలతో రక్షణ కల్పించాలని కోరామని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ తెలిపారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు వివరించారు. అలాగే, విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం.. ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చును సగభాగం జలజీవన్‌ పథకం కింద భరించాలని కోరినట్టు ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.ఈ సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పార్టీ ఎంపీలమంతా భేటీ అయి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయొద్దని కోరామని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. గత స్పీకర్లకు భిన్నంగా ఓం బిర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్ వేదికగా నిరసన చేపడతామని అన్నారు.అనర్హత వేటు అంశంపై 15 రోజులు నోటీసు ఇచ్చి ప్రివిలేజ్‌కు పంపిస్తామని స్పీకర్ అంటున్నారు. ప్రివిలేజ్ కమిటీకి పంపడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రఘురామకృష్ణరాజు వైఖరితో మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగింది.. ఈ విషయంలో ఆయన ప్రివిలేజ్ ఎక్కడ దెబ్బతింది?. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేస్తే పార్లమెంట్‌ను స్తంభింప చేస్తామని స్పీకర్‌కు స్పష్టం చేశాం. జేడీయూ ఎంపీ శరద్‌ యాదవ్‌పై అనర్హత ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే చర్యలు తీసుకున్నారు.ఆయనపై రాజ్యసభ ఛైర్మన్ వెంటనే అనర్హత వేటు వేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయకూడదు.. కానీ, రఘురామకృష్ణరాజు విషయంలో ఏడాది నుంచి స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు.. స్పీకర్ వైఖరి పక్షపాతంగా కనబడుతోంది.. ఇది ఇలాగే కొనసాగితే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని స్పీకర్‌ మేం స్పష్టం చేశామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Related Posts