YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య
విశాఖపట్నం
ఓ తల్లి తొందరపాటు చర్యకి  రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. కుటుం బంలో గొడవలు జరుగుతున్నాయని ఆవేశంలో నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల కొడుకుతో సహా నాలుగంతస్తుల భవనం పైనుంచి దూకేసింది. ఈ విషాద ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. గాజువాక పరిధిలోని చుక్కవానిపాలెంలో నివాసముంటున్న జయంతి బెహరా కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయిం చుకుని కొడుకు రోనిత్ బెహరాతో సహా బిల్డింగ్ పైనుంచి అమాంతం దూకేసింది. తీవ్రగాయాలపాలైన తల్లీ కొడుకులను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. సమాచారం అందు కున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts