YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అక్రమ మైనింగ్ పై సీబీఐతో దర్యాప్తు జరపాలి: ఆలపాటి రాజా డిమాండ్

అక్రమ మైనింగ్ పై సీబీఐతో దర్యాప్తు జరపాలి: ఆలపాటి రాజా డిమాండ్

అమరావతి జూలై 10
విశాఖ మన్యంలో ఎవరి కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని టీడీపీ ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సీఎం పాత్రధారో, సూత్రధారో తేలాంటే సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మైనింగ్‌ లీజులు పొందింది ఎవరని, ఖనిజాన్ని దోచేస్తుంది ఎవరని ఆయన నిలదీశారు. లవకుమార్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి ఎవరని, ఎవరి లారీల్లో ఖనిజాన్ని కడపకు తరలిస్తున్నారని ప్రశ్నలు సంధించారు. వాస్తవాలు బయటకువస్తాయనే టీడీపీ నేతలను అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అఖిలపక్షాన్ని మైనింగ్ ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు.

Related Posts