YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ రాజధాని జగడం

ఏపీ రాజధాని జగడం

విజయవాడ, జూలై 12, 
ఏపీ కి రాజ‌ధాని ఏది ?  కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై తేల్చేసిందా ? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. చంద్ర‌బాబు హ‌యాంలో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా పేర్కొంటూ.. ఇక్క‌డ కొన్ని నిర్మాణాలు చేశారు. అయితే.. ఏ రాజ‌ధానికైనా స‌రిహ‌ద్దులను నిర్ణ‌యించాలి. మ‌రి ఎంతో మేధావిగా చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఈ విష‌యంలో ఎక్క‌డో త‌ప్పులో కాలేశారు. అమ‌రావ‌తి అంటే..కేవ‌లం సీఆర్డీఏ అంటూ.. చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో శాశ్వ‌త నిర్మాణాలు.. కూడా చేప‌ట్ట‌లేదు. హైకోర్టు స‌చివాల‌యం వంటి ప‌లు నిర్మాణాలు.. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న చేప‌ట్టారు. దీనినే రాజ‌ధానిగా పేర్కొన్నారు. ఐదేళ్ల పాల‌న‌లో ఆయ‌న రాజ‌ధాని పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలం చూపించారు.మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. శాశ్వ‌త నిర్మాణాలు చేప‌డ‌తామ‌నే ఉద్దేశంతో దీనిని ఎన్నిక‌ల‌కు ముందు వాయిస్‌గా చేసుకున్నారు. అయితే.. అధికారం ద‌క్క‌లేదు. ఈలోగా అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ పూర్తిగా రాజ‌ధానిపై యూట‌ర్న్ తీసుకున్నారు. మూడు రాజ‌ధానులు ప్ర‌క‌టించారు. అయితే..దీనిపై రాజ‌ధాని రైతులు న్యాయ‌పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు కూడా మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్‌ను వ్య‌తిరేకించ‌లేదు. కేవ‌లం రైతులకు న్యాయం చేయాల‌నే విష‌యాన్ని మాత్ర‌మే ప‌రిశీలిస్తోంది. అయితే ఇప్పుడు ఇదే విష‌యం అమ‌రావ‌తికి శాపంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.తాజాగా ఒకరు ఆర్టీఐ ద్వారా ఏపీకి రాజ‌ధాని ఏది ? అని ప్ర‌శ్నించిన‌ప్పుడు కేంద్ర హోం శాఖ‌.. మూడు రాజ‌ధానులనే పేర్కొంటూ స‌మాధానం ఇచ్చింది. మూడు రాజ‌ధానుల‌నే విష‌యం దీంతో స్ప‌ష్ట‌మైంది. అయితే.. దీనికి కూడా ప్రాతిప‌దిక లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వివాదం ప్ర‌స్తుతం హైకోర్టులో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌ధాని విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి అని కాకుండా.. మూడుకు మొగ్గు చూప‌డం.. ఏకంగా స‌మాచార హ‌క్కు ద్వారా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం వంటివి ఏకంగా.. రాజ‌ధాని విష‌యంలో కేంద్రం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.
అన్నీ హైద్రాబాద్
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అప్పట్లో ఈ రాజధాని భూమి పూజకు ప్రధాని మోడి మట్టి-నీరు తెచ్చిన సంగతి తెలిసిందే. ఎపి రాజధానిగా అమరావతి నిర్థారణ అయినప్పటికీ కేంద్రం మాత్రం ఇంకా రాజధానిగా గుర్తించలేనట్లుంది. కేంద్రలోని వివిధ శాఖల నుండి ఎపి రాజధానికి వస్తున్న లేఖలను చూస్తుంటేనే ఆ విషయం స్పష్టమవుతోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి ఎపి ప్రధాన కార్యదర్శితో పాటు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు వస్తున్న లేఖల్లో.. ' ఎపి సెక్రటేరియేట్‌, హైదరాబాద్‌ ' అని రాస్తున్నారు. ఎపి ప్రభుత్వం నుంచి మాత్రం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు అమరావతి చిరునామాతోనే జరుగుతున్నాయి. ఎపి సెక్రటేరియట్‌, అమరావతి కి బదులు హైదరాబాద్‌ అనే అడ్రస్‌తో ఉత్తరాలొస్తున్నాయి ! కరోనా వైరస్‌ డెల్టాప్లస్‌ వేరియంట్‌పై అప్రమత్తం చేస్తూ జూన్‌ 25 న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాసిన లేఖలో.. ఆదిత్యనాథ్‌దాస్‌ కార్యాలయం చిరునామా హైదరాబాద్‌ అని రాశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల నుండి ఎపి కి రాస్తున్న లేఖలలో చిరునామాలను చూస్తుంటే.. ఎపి కి రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించలేదనే అనుమానాలు రాకమానవు లేదా నిర్లక్ష్యంగానైనా ఉత్తరాలు రాస్తుండాలి. కేంద్ర శాఖల నుండి వచ్చే లేఖలు నిర్లక్ష్యంతో రాస్తున్నారా ? లేదా తామింకా ఎపి రాజధానిగా అమరావతిని గుర్తించలేదన్న విషయాన్ని ఈ రూపంలో స్పష్టం చేస్తున్నారా ? అనే ప్రశ్నలు ఎపి అధికార వర్గాలను వెంటాడుతున్నాయి.

Related Posts