YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి

యాదాద్రి భువ‌న‌గిరి జూలై 12
హరితహారం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కేంద్రంలో రూ. 21.13 లక్షల వ్యయంతో నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెసిడెన్సీ భవనాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి క‌లిసి ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెసిడెన్సీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ క్రిష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్, కలెక్టర్ పమేలా సత్పతి, సీసీఎఫ్ అక్బర్, డీఎఫ్‌వో డీవీ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమం సందర్బంగా  మంత్రులు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు.

Related Posts