YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అఖిలేశ్‌కు కేసీఆర్‌ గుణాత్మక విందు

అఖిలేశ్‌కు కేసీఆర్‌ గుణాత్మక విందు

దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యమని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు కేసీఆర్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. భోజనం అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించనున్నారు.దేశంలో గుణాత్మకమార్పు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రోజు రోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఇదే అంశంపై కేసీఆర్‌తో చర్చించడానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అఖిలేష్‌కు బేగంపేట విమానాశ్రయంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.సీఎం కేసీఆర్ అఖిలేష్ కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. భోజనం అనంతరం సీఎం కేసీఆర్, అఖిలేష్ దేశంలో రాజకీయ పరస్థితులపై సమాలోచనలు చేసేందుకు సమావేశమయ్యారు. గుణాత్మక మార్పు అవసరమని పేర్కొన్న కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు.

Related Posts