మంత్రి ఎర్రబెల్లిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి
జగిత్యాల, 12
బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మహిళా అధికారిణి పట్ల మాట్లాడిన అసభ్య పదజాలంతో యావత్ తెలంగాణ ప్రజలు నివేర్ర పోయారని ఇలాంటి మంత్రిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షులు రామ్మూర్తి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని దీన్ని తీవ్రంగా ఖండిస్తూన్నానన్నారు. ఇటీవలే ఓ మహిళా ఎంపిడిఓ పట్ల మంత్రి దయాకర్ రావు మాట్లాడిన తీరు యావత్ మహిళలను బాధించింది అన్నారు. ఇలాంటి మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని రామ్మూర్తి డిమాండ్ చేశారు. టాస్త్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న దళిత సాధికారత పథకం ఒక పచ్చి మోసం అని ఇదివరకే దళితులకు మూడేకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని మూడెకరాలకంటే 10 లక్షల నగదు గొప్పది కాదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగ సమస్య తీరడం లేదని నిరుద్యోగ సమస్యను తొలగించాలంటే వెంటనే బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రామ్మూర్తి డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు సంస్థల్లోను రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పుడే నిరుద్యోగులకు కొంత ఊరట ఉంటుందని పసుల రామ్మూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర సలహదారుడిగా బొల్లం విజయను, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా మద్దెల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గా గిద్దె శంకరయ్య, మండల యూత్ అధ్యక్షులు గా బొల్లం వంశీని నియమిస్తూ రామ్మూర్తి ఉత్తర్వులను జారీచేశారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శి వేల్పుల ప్రవీణ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసం రాణి, కార్యదర్శి వేల్పుల ప్రవీణ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసం రాణి, జిల్లా యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా రాజు మ్యాకల లక్ష్మణ్, గొల్లపల్లి మండల అధ్యక్షులు నక్క స్వామి, జగిత్యాల మండల గౌరవ అధ్యక్షులు సామెల్, మండల అధ్యక్షులు జక్కుల దేవయ్య ,రఘు, పల్లె బంధా శివ, సంజయ్, నర్ర రఘు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పూలదండలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.