మూసీనదిని ప్రక్షాళన చేయాలి
హైదరాబాద్
బీజేపీ నేతల ఆధ్వర్యంలో ముసారంబాగ్ చౌరస్తా నుంచి మూసీనది బ్రిడ్జి వరకు పాదయాత్ర జరిగింది. వర్షాకాలం నేపథ్యంలో మూసీనదిని పక్షాళన చేయాలని డిమాండ్ చేసారు. మాన్సూన్ ప్రారంభమైన మూసి రివర్ డెవలప్మెంట్ బోర్డ్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ కార్పోరేటర్లు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మూసారాంబాగ్ చౌరస్తా మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది