YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన భూమన

పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన భూమన

పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన భూమన
తిరుపతి
తిరుపతి  గాంధీరోడ్డులో మంగళవారం మధ్యాహ్నం  పారిశుధ్య కార్మికులకు తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర రెడ్డి   నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం సేవా ట్రస్ట్ ప్రతినిధి   పీసీ రాయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసి భూమన కరుణాకర  రెడ్డి జ్యోతిప్రజ్వలన గావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కేక్ కట్ చేశారు. పెద్దయనకు నివాళులు ఆర్పించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు రుద్రరాజు శ్రీదేవి, బండి మధుసూదన రెడ్డి పాల్గొన్నారు.

Related Posts