YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రేపు పోలవరానికి సీఎం వైఎస్ జగన్

రేపు పోలవరానికి సీఎం వైఎస్ జగన్

రేపు పోలవరానికి సీఎం వైఎస్ జగన్
అమరావతి
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.  ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.  గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
 ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలు ఇదీ.
బుధవారం ఉ.10.00 : సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్కు చేరుకుంటారు.
10.10: హెలీకాప్టర్లో పోలవరానికి ప్రయాణం అవుతారు
11.00: ప్రాజెక్టు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
11.10–12.00: క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను  పరిశీలిస్తారు.
మ.12.00–1.00: అధికారులతో సమీక్ష సమావేశం జరుపుతారు.
1.20: హెలీకాప్టర్లో తిరుగుపయనం  అవుతారు.
2.00: తాడేపల్లిలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు.
2.15: సీఎం నివాసానికి వస్తారు.

Related Posts